Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు నన్ను గదికి రమ్మంటున్నాడు.. చనిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:40 IST)
ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో ఓ యువకుడి వేధింపులను భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరణించేందుకు ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.
 
తాను తప్పు చేయలేదని.. బతకాలని వున్నా.. వాడు బతకనివ్వట్లేదని.. తన గదికి రావాలంటున్నాడని ఆ లేఖలో ఇంటర్ విద్యార్థిని రాసుకొచ్చింది. అలా రాకపోతే.. తన ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నానని తెలిపింది. ఆ ఫోటులు బయట పెట్టకపోవడం వల్లే తన ఆత్మకు శాంతి అని.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దని ప్రాధేయ పడుతూ ప్రాణాలు విడిచింది.
 
అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments