Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు నన్ను గదికి రమ్మంటున్నాడు.. చనిపోతున్నా.. ఇంటర్ విద్యార్థిని

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:40 IST)
ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో ఓ యువకుడి వేధింపులను భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరణించేందుకు ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.
 
తాను తప్పు చేయలేదని.. బతకాలని వున్నా.. వాడు బతకనివ్వట్లేదని.. తన గదికి రావాలంటున్నాడని ఆ లేఖలో ఇంటర్ విద్యార్థిని రాసుకొచ్చింది. అలా రాకపోతే.. తన ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నానని తెలిపింది. ఆ ఫోటులు బయట పెట్టకపోవడం వల్లే తన ఆత్మకు శాంతి అని.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దని ప్రాధేయ పడుతూ ప్రాణాలు విడిచింది.
 
అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments