Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ఇంటర్ ప్రవేశాలు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:47 IST)
రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆన్​లైన్​లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించిందన్నారు.

బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ చట్టాలకు అనుగుణంగానే ఇంటర్​ కళాశాలలు పనిచేయాలని.. దానికి భిన్నంగా ర్యాంకుల పేరిట వ్యాపార ధోరణితో ముందుకు వెళ్తుండటం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

ప్రైవేటు, ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంటర్​ విద్యలో 70 శాతం కళాశాలలు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నాయని.. వాటి పనితీరులో లోపాలను సమావేశంలో మంత్రి ప్రస్తావించారు.

కోచింగ్‌ సెంటర్లు, ఇంటర్మీడియట్‌ కళాశాలలను కలపొద్దని స్పష్టం చేశారు. పరిమితికి మించి విద్యార్థులున్న కళాశాలలకు నోటీసులు ఇచ్చామని మంత్రి తెలిపారు.

నాణ్యత ప్రమాణాలతోపాటు ఫీజులు అందరికీ అందుబాటులో ఉండేలా ఫీజ్ రెగ్యులేటరీ కమిషన్ కళాశాలలను తనిఖీ చేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments