Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. యువకుడికి పదేళ్ల జైలు శిక్ష

70 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. యువకుడికి పదేళ్ల జైలు శిక్ష
, సోమవారం, 16 డిశెంబరు 2019 (20:47 IST)
అనంతపురం జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు వెలువరించింది.

వివరాలు... అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి పదేళ్ల జైలు, రూ. పది వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు జడ్జి బి.సునీత తీర్పు చెప్పారు. 24-08-2013 తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండేది. 
 
కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకుని రాజు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అరుపులు వినిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని చికిత్స నిమిత్తం  కళ్యాణదుర్గం ఆ తర్వాత అనంతపురం తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు.

అప్పటి కళ్యాణదుర్గం సి.ఐ జి.రామకృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన అనంతపురం మహిళా కోర్టు జడ్జి నిందితుడికి పదీ సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 
 
పక్కాగా దరాప్తు చేసిన సి.ఐ ను మరియు ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీదేవి, కోర్టు కానిస్టేబుల్  కృష్ణలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే