Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌలిక సదుపాయాలు కల్పించాలి: జగన్ కు నిర్మాతల మండలి లేఖ

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:43 IST)
చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నిర్మాతల మండలి కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాల ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది.

ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి ఒక లేఖ రాసింది. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని చెప్పారు. ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారని తెలిపారు.

అదే మాదిరి ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి స్థలాలను కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్ లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments