కృష్ణా జిల్లాలో పెరుగుతున్న గంజాయి వాడకం

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (09:36 IST)
కృష్ణా జిల్లాలో గంజాయి వాడకం పెరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు భారీగా పట్టుబడుతుండడమే ఉదాహరణ. ఇటీవలి కాలంలో వెయ్యి కిలోలకు పైగా గంజాయి పట్టుబడినట్లు సమాచారం.

తాజాగా గుట్టుచప్పుడు కాకుండా రెండు కార్లలో గంజాయిని లోడు చేసుకుని విజయవాడకు తరలిస్తున్న నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 కిలోల గంజాయి, రెండు కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాదీనము చేసుకున్నట్లు నూజివీడు డి‌ఎస్‌పి బుక్కాపురం శ్రీనివాసులు తెలిపినారు. 
 
హనుమాన్ జంక్షన్ సీఐ, ఆగిరిపల్లి ఎస్సై కిషోర్, వీరవల్లి ఎస్సై చంటిబాబు సిబ్బందితో కలసి నూజివీడు సబ్ డివిజన్, ఆగిరిపల్లి మండలము, ఈదులగూడెం గ్రామ సమీపములో వాహనములు తనిఖీ చేయుచుండగా విశాఖపట్నం నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు అక్రమముగా రెండు కార్లలో 40 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు తేలింది.

దీంతో దానిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments