Webdunia - Bharat's app for daily news and videos

Install App

భిక్షగాడి గదిలో డబ్బులే డబ్బులు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (07:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో గురువారం ఓ భిక్షగాడు హఠాత్తుగా మరణించాడు. రేకుల షెడ్డులో ఉంటూ వచ్చిన ఆ బిచ్చగాడు చనిపోయిన విషయాన్ని పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ భిక్షగాడి గదిని పరిశీలించారు. ఇందులో వేలాది రూపాయల కరెన్సీ నోట్లను, చిల్లర ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటన ఇపుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భిక్షగాడు పేరు రామకృష్ణ. ఐదేళ్ల కిందట గ్రామానికి వచ్చాడు. భిక్షాటన చేస్తూ.. రక్ష రేకులు కడుతూ జీవనం సాగించేవాడు. చేపల మార్కెట్‌ వద్ద చిన్న గదిలో ఉంటూ సమీపంలోని సత్రంలో భోజనం చేసేవాడు. 
 
అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ విషయమై కరప ఎస్‌ఐ డి.రమేశ్‌బాబును మాట్లాడుతూ అతడి వద్ద లభించిన నగదులో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదన్నారు. 
 
నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం లెక్కిస్తామని చెప్పారు. పంచాయతీ కార్మికులతో సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments