Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో షోరూమ్‌ తెరిచిన కెడీఎం

image
, మంగళవారం, 24 మే 2022 (16:18 IST)
సుప్రసిద్ధ కన్స్యూమర్‌ లైఫ్‌స్టైల్‌, మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌ కెడీఎం తమ నూతన బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లోని కోఠి వద్దనున్న గిరిరాజ్‌ లేన్‌లో శ్రీ బాలాజీ సెల్‌కామ్‌ వద్ద ప్రారంభించింది. ఈ స్టోర్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను మొబైల్‌ యాక్ససరీలు, లైఫ్‌స్టైల్‌ విభాగాలలో అందించనుంది. వీటిలో మొబైల్‌ చార్జర్లు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, నెక్‌బ్యాండ్స్‌, హెడ్‌బ్యాండ్స్‌ మొదలైనవి ఉన్నాయి. ఓ దశాబ్ద కాలంగా అగ్రశ్రేణి లైఫ్‌స్టైల్‌, మొబైల్‌ యాక్ససరీస్‌ బ్రాండ్‌లలో ఒకటిగా ఇది నిలువడమే కాదు భారతదేశంలో అతిపెద్ద, అత్యంత సృజనాత్మక మొబైల్‌ యాక్ససరీస్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌గా కూడా నిలిచింది.

 
ఈ సందర్భంగా కెడీఎం ఫౌండర్‌ ఎన్‌‌డీ మలి మాట్లాడుతూ, ‘‘కోఠిలో కెడీఎంను ఏర్పాటుచేయడం వల్ల మీ మొబైల్‌ యాక్ససరీల అవసరాలను అత్యుత్తమ ధరలో అందించే ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది. ఈ నూతన స్టోర్‌ను వ్యూహాత్మకంగా కోఠిలోని బ్యాంక్‌ స్ట్రీట్‌ వద్ద ఏర్పాటు చేశాము. కెడీఎం ఉత్పత్తులు కేవలం స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా ఉండటం మాత్రమే కాదు నగదుకు తగ్గ విలువను అందిస్తాయి. ఈ బ్రాండ్‌ సిద్ధాంతం అయిన ‘కరో దిల్‌ కీ మర్జీ’ ప్రతి భారతీయుడినీ కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు.

 
‘‘హైదరాబాద్‌లో మా స్టోర్‌ ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. హైదరాబాద్‌లో అత్యంత పురాతనమైన వాణిజ్య కేంద్రంలో ఒకటిగా నిలిచిన కోఠి వద్ద దీనిని ఏర్పాటుచేశాము. మేము ఏమి అందిస్తున్నామో స్వయంగా చూసి తెలుసుకోవాల్సిందిగా నగరంలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము. దేశంలోని  మారుమూల ప్రాంతాలలో కూడా మా సంస్థ పేరు ప్రతిధ్వనించేలా చేయాలన్నది తమ లక్ష్యం. 2025 నాటికి అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా నిలువనున్నాం’’అని  కెడీఎం కో-ఫౌండర్‌ బీ హెచ్‌ సుథార్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌరులకు చేసే సహాయంపై తప్పుదారి పట్టించే నివేదికలపై Kooలో PIB ఫ్యాక్ట్ చెక్