Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక గ్రామాల్లో ఆకలి కేకలు - హృదయ విదారక దృశ్యాలు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (14:01 IST)
గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం వల్ల ఏర్పడిన వరద వల్ల కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత ఆరు రోజులుగా అన్నపానీయాల కోసం వారు తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు కోనసీమ లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. 
 
కోనసీమ లంక గ్రామాల ముంపు బాధితులు గత ఆరు రోజులుగా ఆహార ప్యాకెట్ల కోసం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. వరదల కారణంగా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు తిండిలేక అవస్థలు పడుతున్నారు. 
 
కొంతమంది గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులకు ఆహార ప్యాకెట్లు కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునే పరిస్థితి  ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. 
 
వరద తాకిడికి గురైన ప్రాంతాల బాధితులు గత కొద్ది రోజులుగా ఆహారం, నీరు కోసం అల్లాడుతున్నారు. తమకు ఆహారం, నీరు అందించడం లేదని, సరైన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments