Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 4 నుంచి విస్తారంగా వర్షాలు...

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:23 IST)
దక్షిణ భారతదేశంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే నెల నాలుగో తేదీ నుంచి విస్తారంగా వర్షాల కురుస్తాయని దక్షిణ మండల వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ మాట్లాడుతూ, తమిళనాడు, కేరళ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయని తెలిపారు. ఈ కారణంగా నవంబరు నాలుగో తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాజధాని చెన్నై నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సిత్రాంగ్ తుఫాను కారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ యేడాది రుతుపవనాల కారణంగా 45 శాతం అదిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments