Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్‌పురిలోని నాగ్లాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పిచికారి మందుతో ఓ మహిళ టీ తయారు చేసింది. ఈ టీని సేవించిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరుగింటి మహిళ ఉన్నారు. మృతులను శివానందన్ (35), ఈయన కుమారుడు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రామ్ (45)లు ఉన్నారు. 
 
నాగ్లా కన్వై గ్రామానికి చెందిన ఓ మహిళ టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పాలలో కలిపిన విచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాను చేసిన పనికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments