Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్‌పురిలోని నాగ్లాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పిచికారి మందుతో ఓ మహిళ టీ తయారు చేసింది. ఈ టీని సేవించిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరుగింటి మహిళ ఉన్నారు. మృతులను శివానందన్ (35), ఈయన కుమారుడు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రామ్ (45)లు ఉన్నారు. 
 
నాగ్లా కన్వై గ్రామానికి చెందిన ఓ మహిళ టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పాలలో కలిపిన విచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాను చేసిన పనికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments