Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ వంతెన

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దేశంలోనే తొలిసారి ఐకానికి కేబుల్ కమ్ సస్పెన్షన్ వంతెనను నిర్మించనున్నారు. ఈ వంతెనను కృష్ణానదిపై నిర్మిస్తారు. ఇందుకోసం రూ.1,082.56 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ వంతెనను 30 నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని ఆ శాఖామంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ వంతెనను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా - కర్నూలు జిల్లా మధ్య సోమశిల వద్ద నిర్మితంకానుంది. ఇది పూర్తయితే ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిది అవుతుందని.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. 
 
దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటాయని.. వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతంగా అలరారేందుకు కూడా అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే ఉంటుందని.. గోపురం వంటి పైలాన్లు ఉంటాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments