Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో చేరడం లేదు... వైసీపీలోనే కొనసాగుతా.. బుట్టా రేణుక

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు.

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:13 IST)
తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడించారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
అంతకుముందు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మరింత మంది జంప్ చేయనున్నారనే వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే. వీరిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీరితో పాటు మరో ముగ్గురు సీనియ్ నేతలు కూడా ఉన్నట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఇవన్నీ ఉత్తుత్తి వార్తలేనని తేలింది. 
 
కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను దాదాపు వైకాపా స్వీప్ చేయగా, ఆపై దివంగత భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సహా పలువురు ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్లు కూడా గత కొద్దికాలంగా జంప్ జిలానీల జాబితాలో వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments