Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె ఇంట్లో మద్యం సేవించాడనీ... 4వ అంతస్తు నుంచి తోసేశాడు...

అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (12:28 IST)
అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, నారాయణగూడలో సంజు అనే యువకుడు ఆ ప్రాంతంలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతి రోజూ రాత్రి మద్యాన్ని ఇంటికి తెచ్చుకుని సేవించేవాడు.
 
ఈ విషయం ఇంటి యజమాని కుమారుడు బశ్వంత్‌కు తెలిసింది. దీంతో సంజుతో గొడవపడ్డాడు. మద్యం సేవించవద్దని హెచ్చరిక కూడా చేశాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సంజు మద్యం సేవిస్తుండగా బశ్వంత్ చూశాడు. 
 
దీంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఫలితంగా సహనం కోల్పోయిన బశ్వంత్.. సంజును నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. అక్కడ నుంచి కిందపడటంతో సంజుకు బలమైన గాయాలు తగిలాయి. 
 
ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments