Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ తిని అపస్మారక స్థితిలో ఇద్దరు మహిళలు.. ఏమైంది?

Webdunia
గురువారం, 23 జులై 2020 (11:42 IST)
మాంసాహారం తీసుకున్న ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. చికెన్‌ కూర తినడం వల్లే వారు అనారోగ్యానికి కారణమయ్యారని వైద్యులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చందానగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన టైలరింగ్‌ పని చేసే గంగాధర్‌ వద్ద ఇద్దరు పని చేస్తున్నారు. వారు మంగళవారం మధ్యాహ్నం చికెన్‌ తెచ్చి ఓ మహిళకు ఇచ్చి వండమని చెప్పారు. 
 
వండిన చికెన్‌లో కొంత భాగాన్ని ఆ మహిళకు ఇచ్చారు. ఆమె తన కూతురు (15)తో పాటు కొడుకుకూ చికెన్‌ పెట్టి, తానూ తింది. సాయంత్రం భర్త వచ్చిచూడగా అపస్మారక స్థితిలో భార్య, కూతురు, కొడుకు పడివున్నారు. దీంతో చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.
 
చికెన్ కూర తిన్న తర్వాత ఇద్దరు మహిళలు మత్తులోకి జారుకున్నారని తెలిసింది. భర్త ఇంటికి వచ్చి చూసే సమయంలో స్పృహలో లేరని ఇరుగుపొరుగువారి సహాయంతో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఫిర్యాదు ఆధారంగా, చందానగర్ పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ మహిళలపై లైంగిక వేధింపులు జరిగివుంటాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వైద్య పరీక్షల్లో వారిపై లైంగిక వేధింపుల జాడలు లేవని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం