Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో అక్రమ సంబంధం.. భార్యకు తెలిసి...

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:03 IST)
ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి(26), వేణుగోపాల్‌ అలియాస్‌ వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 2012లో జరిగింది. వీరి సంసారజీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ క్రమంలో తనతో పాటు పని చేసే ఓ యువతితో వంశీకి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇదిలావుండగా, సంస్థ ప్రచార పని మీద వంశీ గోవాకు వెళ్లాడు. అక్కడ మరో యువతితో సంబంధం నెరిపాడు. ఆమెనూ వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకున్నాడు. అతని భార్యకు తెలియడంతో మనోవేదనకు గురై శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి ఇంట్లో ఉన్న ఆమె సోదరి ప్రశాంతి అక్క పరిస్థితిని గమనించి జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణగండం తప్పింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments