కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా తెదేపా... కేటీఆర్ సెటైర్లు

పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగ

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:55 IST)
పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో   ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగాణ భవన్ వేదికగా మరో సైటర్ పేల్చారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది ఢిల్లీకి పోతది... టీడీపీకి ఓటు వేస్తే అమరావతికి పోతది. కోదండరాంకు ఓటు వేస్తే ఎటు పోతాదో తెల్వదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో తెలంగాణ భవన్ కార్యకర్తల చప్పట్లతో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ అయ్యిందని, విపక్షాల పొత్తుల విషయంలో ఏమైనా ప్రజల ప్రయోజనం దాగి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.
 
కోదండరాంను ముష్టి మూడు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తన తండ్రిలా ప్రత్యర్ధులు మీద పదునైన మాటల తూటాలు పేల్చడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అంతా కేటీఆర్‌ను తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments