Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్గిపెట్టి ఉందా అని అడిగి.. 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లారు

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:41 IST)
కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి కూడలిలో భుజంగ్ రెడ్డి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
 
నిన్న రాత్రి బైక్ వచ్చిన ఓ యువకుడు సిగరెట్ తీసుకొని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వమని అడిగాడు. యజమాని వొంగి కింద ఉన్న అగ్గిపెట్టి తీసి ఇచ్చే సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు దొంగలు. వెంటనే తేరుకున్న భుజంగ్ రెడ్డి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసి అరుస్తూ  పరిగెత్తుకుంటా వెళ్లాడు. 
 
అయినా  దొంగలు బైకు మీద పారిపోవడం వల్ల ఫలితం లేక పోయింది. భుజంగరెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషనును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్‌ను పరిశీలించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments