Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్గిపెట్టి ఉందా అని అడిగి.. 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లారు

కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:41 IST)
కిరాణా కొట్టు యజమానిని సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అడిగి 3 తులాల బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర‌న‌గ‌ర్ ఉప్పర్ పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి కూడలిలో భుజంగ్ రెడ్డి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
 
నిన్న రాత్రి బైక్ వచ్చిన ఓ యువకుడు సిగరెట్ తీసుకొని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఇవ్వమని అడిగాడు. యజమాని వొంగి కింద ఉన్న అగ్గిపెట్టి తీసి ఇచ్చే సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు దొంగలు. వెంటనే తేరుకున్న భుజంగ్ రెడ్డి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసి అరుస్తూ  పరిగెత్తుకుంటా వెళ్లాడు. 
 
అయినా  దొంగలు బైకు మీద పారిపోవడం వల్ల ఫలితం లేక పోయింది. భుజంగరెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషనును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిసి ఫుటేజ్‌ను పరిశీలించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments