Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచారం... దంపతులే ఆ పని చేస్తున్నారు..

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (09:59 IST)
వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా జరుగుతున్న హైటెక్ వ్యభిచారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులో జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో ఈ ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవని వెల్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వెల్ నెస్ సెంటర్ పేరుతో లోకాంటో వెబ్ సైట్‌లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. 
 
శైలజ తన మొబైల్ నంబర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టి ఫోన్ చేసిన వారికి వివరాలు తెలుపుతోంది. తనకు సాయంగా గద్వాలకు చెందిన చందా వనజశ్రీని నియమించుకుంది. ఆమె ద్వారా కూడా విటులను ఆకర్షిస్తోంది. ఆమెకు నెలకు రూ.10,000 ఇస్తోంది. మరోవైపు బ్రోకర్ల సాయంతో వీరు ఉత్తరాది రాష్ట్రాలనుంచి మహిళలను తీసుకువచ్చి వారితో వెల్ నెస్ సెంటర్‌లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనికి భర్త పరమేశ్వరన్ కూడా సహకరిస్తున్నాడు. గతకొంత కాలంగా జరుగుతున్న ఈ హైటెక్ దందాపై పోలీసులకు సమాచారం అందింది.
 
గురువారం వెల్ నెస్ సెంటర్ పై దాడి చేసి నిర్వాహకురాలు శైలజతో సహా నలుగురు మహిళలను, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకున్న భర్త పరమేశ్వరన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments