Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైంది.. నలుగురు పిల్లలకు తండ్రి.. కానీ యువతిపై పలుమార్లు అత్యాచారం..

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:01 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేశాడు. సోషల్ మీడియా పరిచయం ఆ యువతి కొంపముంచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు యువతి పలుమార్లు అత్యాచారానికి గురైంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి టిక్‌టాక్‌లో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌ వాసి అక్బర్‌షా(34)తో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన అమాయకురాలు.. తన సర్వస్వాన్ని అప్పగించింది. ఓ రోజు ఇద్దరు కలిసి టోలీచౌకీలోని అక్బర్ షా సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక గానీ ఆ యువతికి తెలియరాలేదు.
 
చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకుని పలుమార్లు అత్యాచారానికి గురైంది. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పెళ్లి చేసుకుంటానని బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆచూకీ లేకుండా పోయాడు. బాధితురాలు ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. అప్పటికే అక్బర్ షాకు పెళ్లైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments