Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదివేల రూపాయలకు 3 నెలల పసికందును అమ్మేసింది.. ఎక్కడ?

పదివేల రూపాయలకు తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌కి చెందిన పైడాల పద్మ(25) రోజువారీ కూలీగా జీవన

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:09 IST)
పదివేల రూపాయలకు తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌కి చెందిన పైడాల పద్మ(25) రోజువారీ కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త బాలరాజు.. కొద్ది రోజుల క్రితం ఆమెను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయాడు. ఆమెకు మూడు నెలల పసికందు ఉన్నాడు. 
 
కాగా.. తనను వదిలి వెళ్లిపోయిన భర్త కోసం గాలిస్తుండగానే.. పద్మకి యాక్సిడెంట్ జరిగింది. దీంతో బిడ్డ పోషణ కష్టతరంగా మారింది. కూలీ పనికి వెళ్దామనుకుంటే.. బిడ్డను ఎవరూ చూసుకోలేని పరిస్థితి. దీంతో చేసేది లేక కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా 
 
బాలాపూర్‌లోని రాజీవ్ గృహకల్పలో పనిచేసే కుమారి లక్ష్మమ్మ అనే మహిళకు తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. రూ.10వేలకు ఆ మగబిడ్డను కొనుగోలు చేసేందుకు అంగీకరించిన ఆమె.. అడ్వాన్స్ గా రూ.4,500 ఇచ్చింది. 
 
కానీ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డ తల్లిని, కొనుగోలు చేసిన మహిళలను ఇద్దరినీ అరెస్టు చేశారు. బిడ్డను ఇవ్వాలనుకుంటే చట్టపరంగా ఇవ్వాలని పోలీసులు సూచించారు. అక్రమంగా బిడ్డను అమ్మడం అన్యాయమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments