Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తలపై రోకలి బండతో దాడి.. ఆపై కత్తితో గాయపర్చుకున్న భార్య.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:15 IST)
ఇటీవల సైదారాబాద్‌లో పట్టపగలు వృద్ధ దంపతులపై దాడి, దోపిడీ కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసే విషయంపై భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భార్య రోకలిబండతో భర్తపై దాడి చేసి ఇంట్లో కత్తితో తనకు తాను గాయపపర్చుకుని దొంగల దాడిగా సృష్టించినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌ పర్హాకాలనీలో ట్రాన్స్‌కో రిటైర్డ్‌ ఏఈ షరాప్‌ వామనమూర్తి (75). భార్య అనురాధ (65) నివాసముంటున్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు అమీర్‌పేటలో, కూతురు బెంగళూర్‌లో నివసిస్తున్నారు. వామనమూర్తికి అప్పులు అధికం కావడంతో పర్హాకాలనీలోని ఉంటున్న ఇంటిని 2017లో రూ.60 లక్షలు విక్రయించారు. కానీ, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఏడాదిన్నర కాలంగా ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు.
 
ఈ క్రమంలో ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలన్న బాధ, డబ్బుల విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఆమె రోకలిబండతో భర్త తలపై రెండు సార్లు బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంటి వెనుక బాత్‌రూంలోకి వెళ్లి తలపై నీళ్లు పోసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పనిమనిషితో.. ఈ విషయం బయటకు చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది. 
 
అనంతరం పనిమనిషి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి అనురాధ తనకు తాను కత్తితో గాయపర్చుకుని బయటకు పరుగెత్తి పొరుగింటి వారిని పిలిచి దోపిడీ దొంగల బీభత్సంగా నమ్మబలికింది. చేతులకు గాయాలైన అనురాధను, ఇంటి వెనుక బాత్‌రూమ్‌లో కుప్పకూలిన వామనమూర్తిని స్థానికులు చికిత్స నిమి త్తం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దాడిపై ఆరా తీయగా ఈ వృద్ధ దంపతుల డ్రామా వెలుగులోకి వచ్చింది. అనురాధ తమపై దోపిడీ దొంగలు దాడి చేసి పారిపోయారని పోలీసులకు చెప్పడంతో ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు పనిమనిషి బయటకు వెళ్లిన తర్వాత 11.40 గంటల వరకు ఇతరులు ఎవరూ లోపలికి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వెనుక ప్రాంతాలలో సైతం సీసీ ఫుటేజీని పరిశీలించి దొంగలు ఎవరూ రాలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు సంఘటన జరిగిన సమయంలో దంపతులు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నారు. అంతకు ముందు ఇంటి నుంచి వెళ్లిన పనిమనిషిని పోలీసులు విచారించగా వారి గుట్టు రట్టయిందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments