కంటిలో పొడవాటి పురుగు.. ఆపరేషన్ తీసి వెలికి తీశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:00 IST)
కంటిలో నలుసు పడితేనే తట్టుకోలేం. అలాంటి పొడవాటి పురుగు చేరితే ఇంకేమైనా వుందా.. అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ నగర పరిధిలోని పెందుర్తికి చెందిన బి.భారతి గత కొంతకాలంగా తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించగా వారు మందులు రాసిచ్చారు. 
 
ఎన్ని మందులు వాడుతున్నా తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య తీరక పోవడంతో శంకర్‌ ఫౌండేషన్‌ వైద్యశాలకు వెళ్లింది. అక్కడ ఆమె కంటిని పరిశోధించిన వైద్యులు ఆమె కంటిలో పురుగు వున్నట్లు గుర్తించారు. ఆపై ఆపరేషన్‌ అవసరమని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసి ఆమె కంటిలో ఉన్న 15 సెంటిమీటర్ల పొడవైన నులిపురుగును వెలికితీశారు. 
 
ఇన్నాళ్ల పాటు కంటిలో వుండిపోయిన ఆ పొడవాటి నులిపురుగును చూసి వైద్యులు షాకయ్యారు. శస్త్రచికిత్స అనంతరం కంటి నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో భారతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు కంటి నొప్పితో తాను పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదని వాపోయింది. వైద్యులు ఆ నొప్పి నుంచి తనను కాపాడారని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments