Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడే యముడు... వీడిన టెక్కీ లావణ్య మర్డర్ కేసు మిస్టరీ

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (18:34 IST)
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సురేంద్ర నగర్‌కు చెందిన సునీల్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య అనే యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తనను పెళ్ళి చేసుకోవాలని లావణ్య సురేంద్రను ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు ఓ ప్లాన్ వేసింది. రెండు రోజుల క్రితం మాట్లాడుకుందామని చెప్పి సునీల్ లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి సురారంలోని కాలువలో పడేశారు. 
 
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన లావణ్య తిరిగి రావకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్.సి.పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమె ప్రియుడు సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో టెక్కీ లావణ్య హత్య కేసులోని మిస్టరీ వీడినట్టయింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments