Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు... తప్పిన పెను ముప్పు

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు... తప్పిన పెను ముప్పు
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (19:08 IST)
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ఆరో నంబరు ఫ్లాట్‌ఫాంపై నిలిపివున్న సమయంలో బోగీలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించాయి. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. 
 
రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచివున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా బయలుదేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలిదశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం : ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ ఫైట్