Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:17 IST)
ఇటీవలి కాలంలో నేరాలు ఘోరాలకు భాగ్యనగరం అడ్డాగా మారిపోతోంది. ఈ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు చేతులు విరగ్గొట్టి ముళ్ళపొదల్లో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్‌బజార్ పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ళ బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని రెండు చేతులు విరగ్గొట్టి ఆ బాలుడిని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. 
 
ఆ తర్వాత తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలించగా, ఆ బాలుడు ముళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఇది భిక్షగాళ్ళ మాఫియా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments