Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రావట్లేదని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (08:58 IST)
హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, జియాగూడ క్రాంతిభవన్‌కు చెందిన జి. కమలేష్ (40), శ్రీవిద్య అనే దంపతులు ఉన్నారు. వీరికి పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కమలేష్ హైటెక్ సిటీలోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో శ్రీవిద్య పుట్టింటికి తన కుమారుడుతో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ కమలేష్ పలుమార్లు భార్యను కోరాడు. కానీ, ఆమెవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన కమలేష్ తన ఇంట్లోని పడకగదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. 
 
గత నాలుగు రోజులుగా కమలేష్‌ ఉంటున్న ఇంటి తలుపులు తీయకపోవడం, ఇంటి ముందు నాలుగు రోజుల పేపర్లను గమనించిన స్థానికులు తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపు గడియ వేసి ఉండటంతో గడియ పగులగొట్టి చూసే సరికి బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు కుల్సూంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments