Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లముందే ప్రియుడితో సల్లాపాలు.. చూసి జీర్ణించుకోలేక భర్త సూసైడ్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:30 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడి వివాహేతర సంబంధం కొనసాగించిన భార్యను చూసి జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రొళ్ల వడ్రహట్టి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప కుమారుడు పీజీ నాగరాజు (28)కు అదే గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన యేడాది వరకూ ఎలాంటి గొడవలూ లేకుండా సాఫీగా సంసారాన్ని సాగించారు. 
 
కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన హెచ్‌. నాగరాజు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇంకా అతనితో  సన్నిహితంగా మెలగసాగింది. క్రమేపి అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. ఈ విషయంగా భార్యాభర్తలిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. భార్య మాట వినకపోవడంతో విసిగిపోయాడు. గత గురువారం భార్య ప్రియుడు హెచ్ నాగరాజుతో కలిసి ఉండటాన్ని అతడు చూశాడు. భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు. 
 
మూడు రోజుల నుండి వెతుకుతున్నా ఆచూకీ తేలలేదు. చివరికి ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహాన్ని చూసి చలించిపోయిన తండ్రి హనుమంతరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments