Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

ఐవీఆర్
గురువారం, 27 మార్చి 2025 (15:52 IST)
కదులుతున్న రైలులో ఎక్కుట గానీ దిగుట గానీ ప్రమాదము అని ప్రతి రైల్వే స్టేషనులోనూ నెత్తినోరు కొట్టుకుంటూ రైల్వే సిబ్బంది చెప్పినప్పటికీ కొందరు దాన్ని పెడచెవిన పెడుతుంటారు. దీనితో అక్కడక్కడా జరిగే ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పేతుంటే మరికొందరు అంగవైకల్యం చెందుతున్నారు. కదులుతున్న రైళ్లలో ఎక్కుట లేదా దిగుట రెండూ ప్రమాదమే. రైలు కదిలిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు ఎక్కరాదు. అలాగే రైలు కదులుతూ వున్న సమయంలో దిగటమూ తప్పే అవుతుంది.
 
విశాఖ సిటీ రైల్వే స్టేషనులో ఇలాంటి ఘటన జరిగింది. రైలు బండి స్టేషను నుంచి కదిలి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మహిళ చేయి పట్టుకుని పరుగుపెడుతూ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఐతే రైలు వేగం అందుకోవడంతో సదరు మహిళ కిందపడిపోయింది. ఇంకాస్త వుంటే ఆమె రైల్వే ఫ్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయేది. ఐతే అక్కడే వున్న రైల్వే పోలీసు వెంటనే స్పందించి ఆమెను కాపాడారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments