Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (14:41 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఈ పండుగ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే పండగగా ఈ రొట్టెల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికంగా ఉండే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో ఈ పండుగ ప్రారంభమైంది. 
 
ఐదు రోజుల పండుగలో భాగంగా, తొలిరోజున బారాషాబీద్ దర్గాలో 12మంది అమరవీరుల సమాధులను ముస్లిం మతపెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను సమాధులపై కప్పి ప్రార్థనలు నిర్వహించారు.
 
కాగా, ఈ పండుగ తొలి రోజున రాష్ట్రం నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసిన అనంతరం కోర్కెల రొట్టెల కోసం ఎగబడ్డారు. అంతకుముందు దర్గాలో ప్రార్థనలు చేశారు. 
 
జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అధికార బృందంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, వారు కూడా పట్టుకున్నారు. 
 
ఇక పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ విచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments