Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (14:41 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఈ పండుగ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే పండగగా ఈ రొట్టెల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికంగా ఉండే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో ఈ పండుగ ప్రారంభమైంది. 
 
ఐదు రోజుల పండుగలో భాగంగా, తొలిరోజున బారాషాబీద్ దర్గాలో 12మంది అమరవీరుల సమాధులను ముస్లిం మతపెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను సమాధులపై కప్పి ప్రార్థనలు నిర్వహించారు.
 
కాగా, ఈ పండుగ తొలి రోజున రాష్ట్రం నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసిన అనంతరం కోర్కెల రొట్టెల కోసం ఎగబడ్డారు. అంతకుముందు దర్గాలో ప్రార్థనలు చేశారు. 
 
జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అధికార బృందంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, వారు కూడా పట్టుకున్నారు. 
 
ఇక పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ విచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments