నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (14:41 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఈ పండుగ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే పండగగా ఈ రొట్టెల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికంగా ఉండే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో ఈ పండుగ ప్రారంభమైంది. 
 
ఐదు రోజుల పండుగలో భాగంగా, తొలిరోజున బారాషాబీద్ దర్గాలో 12మంది అమరవీరుల సమాధులను ముస్లిం మతపెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను సమాధులపై కప్పి ప్రార్థనలు నిర్వహించారు.
 
కాగా, ఈ పండుగ తొలి రోజున రాష్ట్రం నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసిన అనంతరం కోర్కెల రొట్టెల కోసం ఎగబడ్డారు. అంతకుముందు దర్గాలో ప్రార్థనలు చేశారు. 
 
జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అధికార బృందంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, వారు కూడా పట్టుకున్నారు. 
 
ఇక పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ విచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments