Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:36 IST)
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. లాకర్‌లో ఉన్న 17 కేజీల బంగారం, పెట్టెలోని రూ.2.66 లక్షల నగదు అపహరణకు గురైంది.

ఈ చోరీ సోమవారం వెలుగులోకొచ్చింది. శుక్రవారం విధులు పూర్తయిన తర్వాత సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లారు. శని, ఆదివారం కార్యాలయానికి సెలవు. అయినప్పటికీ మేనేజర్‌ పురుషోత్తం శనివారం బ్యాంకుకు వచ్చి మధ్యాహ్నం వరకు పనిచేసి వెళ్లారు.

సోమవారం ఉదయం సిబ్బంది విధులకు హాజరుకాగా.. అప్పటికే బ్యాంకులో సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ కన్పించలేదు. నగదు పెట్టెలోని రూ.2.66 లక్షలు కూడా మాయమైనట్టు నిర్ధారించారు. దీంతో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులకు అక్కడ చోరీ జరిగిన ఆనవాళ్లు (తాళాలు, గోడ పగులగొట్టడం వంటివి) కనిపించలేదు.

దాంతో అనుమానం వచ్చి బ్యాంకు లాకర్‌ను తెరిపించి చూడగా.. అందులోని బంగారం మొత్తం మాయమైంది. ప్రాథమిక విచారణలో రూ.3.45 కోట్లు విలువచేసే 17 కిలోల బంగారం అపహరణకు గురైనట్టు తేలినట్టు సమాచారం. బ్యాంకు మేనేజరును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments