Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో పరువు హత్య, బైకుపై వెళుతున్న వైద్యుడిపై బండరాళ్లతో దాడి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (18:29 IST)
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆదోని విట్టా క్రిష్టప్పనగర్‌లో ఫిజియో థెరపీ వైద్యుడిని అతి దారుణంగా హత్య చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై బైక్ పైన వెళుతున్న డాక్టర్ ఆదాం అస్మిత్‌ను బండరాళ్ళతో కొట్టి చంపారు దుండగులు. రెండు నెలల క్రితం మహేశ్వరిని ప్రేమ వివాహం చేసుకుని విట్టల్ నగర్‌లో నివాసముంటున్నారు ఈ దంపతులు.
 
ఇద్దరిదీ వేరువేరు సామాజిక వర్గం. ఆదాంతో పెళ్ళికి ఒప్పుకోలేదు మహేశ్వరి తల్లిదండ్రులు. హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆదాం..మహేశ్వరి. తన భర్తను తమ తల్లిదండ్రులే హత్య చేశారని మృతుని భార్య మహేశ్వరి ఆరోపిస్తోంది.
 
మోటారు బైక్ పైన వెళుతున్న ఆదాంపై దారి కాచి ముఖంపై బండరాళ్ళ వేసి హత్య చేశారు దుండగులు. మృతుడు దేవి నర్సింగ్ హోంలో ఫిజియో థెరపీ వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. హత్య కాబడిన వ్యక్తి విట్టల్ నగర్‌లో వుండే ఆదాం స్మిత్‌గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరువు హత్య కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments