Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాగా క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

బాగా క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (11:21 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుసమాచారం. గడ్డి కుంభకోణంలో ఆయనకు జైలుశిక్ష పడింది. ఆ తర్వాత ఆయన జైలు జీవితానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.
 
ఈ క్రమంలో గతకొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించొచ్చని వైద్యులు చెబుతున్నారు. 
 
లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుడు డాక్టర్ ప్రసాద్ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. అయితే లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని వైద్యుడు ప్రసాద్‌ వెల్లడించారు.
 
అదేసమయంలో చికిత్స కోసం ఆయనను ఎక్కడకూ తరలించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయపడ్డారు. వ్యాధిని ఏ మందూ నయం చేయలేదని.. వేరోచోట చికిత్స చేయించినా ఫలితం ఉండక పోవచ్చన్నారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ ప్రజలకు శుభవర్త.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే కరోనా టీకాలు!