Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దొండపండు లాంటి భార్య, ఆ ఒక్క రాత్రి తను ఇంట్లో లేని సమయంలో మరొకరు వచ్చారనీ...

దొండపండు లాంటి భార్య, ఆ ఒక్క రాత్రి తను ఇంట్లో లేని సమయంలో మరొకరు వచ్చారనీ...
, శనివారం, 12 డిశెంబరు 2020 (21:55 IST)
వారిద్దరి అన్యోన్యమైన దాంపత్యం. బంధువులే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేవారు. అయితే అనుమానం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అందమైన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో తరచూ గొడవపెట్టుకునేవాడు భర్త. చివరకు చేసేది లేక ఆత్మహత్య చేసుకుంది భార్య. 
 
తమిళనాడు కాంచీపురం సమీపంలోని కుప్పమ్మల్ వినాయకపురంలో కదిరివేల్, మణిమంగలై దంపతులు నివాసముండేవారు. వీరికి 8 సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. 
 
కదిరివేల్ ప్రభుత్వ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగి. రాత్రి వేళల్లో ఉద్యోగం నిమిత్తం వెళ్లేవాడు. అయితే సరిగ్గా రెండునెలల నుంచి వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కుప్పమ్మల్ బంధువు రాత్రి వేళలో వచ్చి ఇంట్లో నిద్రించాడు. వరుసకు మామ. 
 
పనిమీద కాంచీపురం రావడంతో తెలిసిన బంధువు ఇంటిలోనే సేదతీరాడు. ఇక అప్పటి నుంచి కదిరివేల్‌లో అనుమానం మొదలైంది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో ఊగిపోతూ పదేపదే గొడవకు దిగేవాడు. 
 
భర్తకు ఎంత సర్దిచెప్పినా వినిపించుకునేవాడు కదా. దాంతో పాటు తాగుడికి బానిసై ప్రతిరోజు భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో నిన్న రాత్రి కుప్పమ్మాల్ ఉరి వేసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తనలా మరొకరికి ఇలాంటి కష్టం రాకూడదని.. చేయని తప్పుకు నరకం అనుభవిస్తున్నాననీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సుసైడ్ లేఖ రాసి చనిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో క్రమేపీ పెరుగుతున్న భక్తుల సంఖ్య, లక్షల్లో వస్తున్నారు