వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికే ఇళ్లు... ఎలా గుర్తించడం?

అమరావతి: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో జరిగిన మంత్రిమండలి ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు

Webdunia
గురువారం, 10 మే 2018 (20:07 IST)
అమరావతి: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో జరిగిన మంత్రిమండలి ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు డాక్టర్ పి.నారాయణ, కింజరాపు అచ్చన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో లబ్దిదారులకు  తెలియకుండా వారిపేర్లుపై ఇళ్లు మంజూరు చేసిన అంశం చర్చకు వచ్చింది. వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారి పేర్లపై ఇళ్లు మంజూరైనట్లు రికార్డులలో నమోదు కావడంతో ఇళ్లు మంజూరు చేయడం కుదరడంలేదని అధికారులు తెలిపారు.
 
అటువంటి దరఖాస్తులను పరిశీలించి, అధికారులు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి, వారికి నిజంగా ఇల్లు లేకపోతే, పాత రికార్డులలో వారి పేర్లు తొలగించి, కొత్తగా ఇల్లు మంజూరు చేయమని ఉపసంఘం ఆదేశించింది. 2004కు ముందు ఎస్టీలకు రూ.7500 లతో నిర్మించిన పూరిళ్లు, షెడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వారికి కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ నిధులకు కొరతలేదని, నిర్మాణం వేగం పెంచాలని మంత్రి యనమల ఆదేశించారు. 
 
కొన్ని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని అధికారులు కోరగా మంత్రి మంజూరు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలల్లో గృహ నిర్మాణ వ్యయం ఒకే రకంగా ఉండాలని, మెటీరియల్, ఇతర అదనపు సౌకర్యాలకు అదనంగా అయ్యే ఖర్చుని లబ్దిదారుడు భరించడానికి సిద్ధంగా ఉంటే అందుకు అనుమతించాలన్నారు. నిర్మాణం పూర్తి అయి, మౌలిక వసతులు లేక స్వాధీనం చేసుకోని ఇళ్లకు మౌలిక వసతులు సమకూర్చాలని నిర్ణయించారు.
 
ఇళ్ల నిర్మాణ వ్యయం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం(నరేగా) కింద 90 రోజుల పని దినాలు, గ్రూప్ ఇళ్లు, మెటీరియల్, పట్టణ, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, అపార్ట్ మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, అగనంపూడి, రాజంపేటలలో ఇళ్ల నిర్మాణం, కడప శాటిలైట్ టౌన్ షిప్, పీఎంఏవై ఇళ్ల నిర్మాణం, హడ్కో రుణం, వడ్డీ శాతం వంటి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాలవలవన్, గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments