Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి హోం మంత్రి అమిత్ షా రాకలోని అంతర్యమేమి?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (08:56 IST)
శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం కేంద్రం హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వస్తున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి అమిత్ షా ఫ్యామిలీ చేరుకుంటుంది. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టరులో శ్రీశైలంకు వెళ్లి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో అమిత్ షా కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. 
 
స్వామి దర్శనం అనంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్‌లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టరులో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకోనున్నారు. 
 
అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని తెలుస్తోంది. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments