Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి హోం మంత్రి అమిత్ షా రాకలోని అంతర్యమేమి?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (08:56 IST)
శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనం కోసం కేంద్రం హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంకు వస్తున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి అమిత్ షా ఫ్యామిలీ చేరుకుంటుంది. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టరులో శ్రీశైలంకు వెళ్లి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో అమిత్ షా కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. 
 
స్వామి దర్శనం అనంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్‌లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టరులో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకోనున్నారు. 
 
అక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని తెలుస్తోంది. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments