Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSLV మిషన్ ఫెయిల్ : సాంకేతిక లోపంతో ఫెయిల్

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (09:49 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే విఫలమైంది. మూడో దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్‌ ప్రకటించారు. 
 
భూ పరిశీలన ఉపగ్రహం (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - ఈఓఎస్-03)​ ఉప గ్రహాన్ని అనేక ప్రయోజనాలు పొందేలా ఇస్రో రూపొందించింది. దేశ భూభాగం, సరిహద్దులు, అడవులకు సంబంధించి స్పష్టమైన ఛాయా చిత్రాలను పంపేలా తయారు చేశారు. కుంభవృష్టి, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులపై కూడా త్వరగా అప్రమత్తమయ్యేలా సమాచారం పొందే ఉద్దేశంతో రూపొందించారు.
 
ఈ వాహననౌక ప్రయోగాన్ని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్​ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 ద్వారా ఈవోఎస్​-3ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రయోగం విఫలమైంది. 
 
మూడో దశ అయిన క్రయోజనిక్‌ దశలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ ప్రయోగం విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. దీంతో అది నిర్దేశిత మార్గంలోకాకుండా మరోమార్గంలో వెళ్లిందని, ఫలితంగా ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments