Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాలలకు సెలవులు తగ్గింపు, సంక్రాంతికి మూడు రోజులు మాత్రమే

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (20:06 IST)
కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంలో పోలిస్తే కేసుల ఉధృతి తగ్గినా వైరస్ భయం మాత్రం ప్రజల్లో ఇంకా తగ్గలేదు. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ వల్ల విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. ఇవాళ నుంచి పాఠశాలలు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినా, ఏపీలో జగన్ సర్కారు మాత్రం నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించుకుంది.
 
అందుకు తగ్గట్టే విద్యాశాఖ అధికారులు కూడా ఈ విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలండర్‌ను సిద్దం చేసే పనిలో పడ్డారు. దాదాపు ఐదు నెలలు పని దినాలు తగ్గడంతో జగన్ సర్కారు అందుకు అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పు చేస్తోంది. దీనికి తగు విధానంలో విద్యాశాఖ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అదేవిధంగా ఉపాధ్యాయులు సెలవులపై కూడా పరిమితిని విధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
 
వారానికి ఆరు రోజులు పనిదినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్దం చేశారు. సాధారణంగా సంక్రాంతికి పది నుంచి 13 రోజులు సెలవు ఉండేది. కాని ఈ సారి కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా పాఠశాల హాజరు పట్టికలో ఇకపై కులం, మతం వివరాలు ఉండకూడదని విద్యాశాఖ సంచాలకులు వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి, విద్యార్థిని పేరు ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments