Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన విజేతలు వీరే

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (10:05 IST)
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయభేరీ మోగించింది. అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వై నాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన జగన్ నేతృత్వంలోని వైసీపీకి రాష్ట్ర ఓటర్లు దిమ్మతిరిగే ఫలితాలను కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన ఆ పార్టీ.. ఈ సారి సైకిల్ స్పీడు ముందు తేలిపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
ఇక టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల ఇంతకుముందెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీలు సాధించడం జరిగింది. గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95,235 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ 92,401, మంగళగిరి నుంచి నారా లోకేశ్ 91,413 ఆధిక్యంతో విజయం సాధించారు. 
 
అలాగే, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి రమేశ్ 81,870, నెల్లూరు అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి నారాయణ 72,489, తణుకు నుంచి టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్ నుంచి జనసేన నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ శ్రీనివాస్ 71,404, పిఠాపురం నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీలను నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments