Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైంది. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, ఈ కేసులో ఆయనను ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ పేరు ఉంది. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైలులో ఉన్నారు. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పేర్ని నాని  పిటిషన్‍ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నంపైన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాల మాయం కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ కల్పించాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌‍లో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments