Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైంది. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, ఈ కేసులో ఆయనను ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ పేరు ఉంది. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైలులో ఉన్నారు. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పేర్ని నాని  పిటిషన్‍ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నంపైన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాల మాయం కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ కల్పించాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌‍లో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments