'థాంక్యూ సో మచ్ మావయ్య'.. చంద్రబాబు ట్వీట్‌కు ఎన్టీఆర్ స్పందన

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:31 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా, నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదారణ పొందింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. 
 
తెలుగు సినిమా ఖ్యాతిని నలుమూలలా చాటింది. ఈ చిత్రంలోని "నాటునాటు" పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వరించింది. ఆ ఘనతను సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందంపై ప్రశంస వర్షం కురుస్తుంది.
 
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును "ఆర్ఆర్ఆర్" చిత్రం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబు తన ట్వీట్ పేర్కొన్నారు. ఎంఎం కీరవాణి, రాజమౌళి, చిత్రం యావత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాను గతంలో చెప్పినట్టుగానే తెలుగు ఇపుడు ఇండియన్ సాఫ్ట్ పవర్‌గా మారిందన్నారు. దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. "థ్యాంక్యూ సో మచ్ మావయ్య" అంటూ ప్రతిస్పందించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments