Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు జైలుశిక్ష

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (11:06 IST)
లక్షద్వీప్ లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌ ఓ హత్యాయత్న కేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనకు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చింది. వీరందరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి మరో నలుగురితో కలిసి ఫైజల్ ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులంతా హత్యాయత్నానికి ప్రయత్నించి విఫలైనట్టు కోర్టు తేల్చింది. దీంతో వీరందరినీ దోషులుగా ప్రకటించింది. 
 
మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని కేరళ రాష్ట్రంలోని కున్నూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హత్యాయత్న కేసులో మహ్మద్ దోషిగా తేలడంతో ఆయనపై లోక్‍సభలో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments