Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులూ మీరు గుర్తున్నారు: అచ్చెం నాయుడు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (22:15 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పోలీసులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జాగీరుల్లా మారిపోయారని మండిపడ్డారు. కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ప్రతిపక్షపార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్లు అక్రమ కేసులను బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
తిరుపతిలో ఈరోజు ధర్మపరిరక్షణ పేరుతో యాత్రను చేపట్టారు అచ్చెం నాయుడు. అయితే టిడిపి నేతలను యాత్ర చేయనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అచ్చెంనాయుడును హోటల్ లోనే నిర్బంధించారు. కార్యక్రమానికి బయలుదేరిన టిడిపి నేతలను అడ్డుకున్నారు. 
 
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ అరెస్టులు చేసేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రానికి నేతలను విడిచిపెట్టారు. అయితే అచ్చెమనాయుడు మాత్రం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కావాలనే తమపై కేసులు పెడుతున్నారన్నారు. 
 
తమపై కేసులు పెట్టే ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా గుర్తించుకుంటామని.. అలాంటి వారిపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పదవీ విరమణ చేసేస్తాం.. ఇక మనం వెళ్ళిపోతాం.. మనల్ని ఏమీ చేయలేరులే అనుకుంటే పొరపాటే.. టిడిపి కార్యకర్తలను ఏ పోలీసు అధికారి ఇబ్బందులకు గురిచేసినా వదిలిపెట్టేది లేదన్నారు అచ్చెమనాయుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments