Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో కుండపోత.. నదిని తలపిస్తున్న రోడ్లు (video)

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (08:42 IST)
AP Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బెజవాడలో భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. శనివారం నుంచి కురిసిన జడివాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62,550 హెక్టార్లలో పంట ముంపుబారిన పడినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది చనిపోయారు.

ఇంకా వర్షాలకు తిరుమలలో ఓ భారీ వృక్షం కూలడంతో భక్తురాలు తీవ్రగాయాలపాలయ్యారు. ఏఎంసీ ప్రాంతంలోని 305వ కాటేజీ వద్ద చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి కూర్చొని ఉండగా, సమీపంలోని భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కొమ్మలు ఆమెకు తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అలాగే కాకినాడ జిల్లాకు వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోర్టు నుంచి మూడోరోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments