Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఉత్తర కోస్తా ... నేడు రేపూ ఇదే పరిస్థితి

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (13:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మండిపోతుంది. సూర్యతాపంతో ఆ ప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించారు. ఆది, సోమవారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఆరేబియా సముద్రంలో ఉన్న అతితీవ్ర తుఫాన్, బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం దిశగా గాలులు వీయడంతో మొత్తం భూభాగం పొడిగా మారింది. ఇదేసమయంలో ఉత్తరకోస్తాపైకి వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఉదయం నుంచే వేడి వాతావరణం కొనసాగింది. పది గంటల నుంచే వడగాడ్పులు వీచాయి. 
 
కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు, గాడ్పులు వీచాయి. రాత్రి ఎనిమిది గంటలకు కూడా వాతావరణం వేడిగానే ఉంది. రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు కొనసాగడం సాధారణమే అయినా వారం నుంచి రోజురోజుకూ ఎండలు, వడగాడ్పులు పెరుగుతున్నాయి. 
 
రాష్ట్రంలో శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు నుంచి 11 డిగ్రీలు ఎక్కు వగా నమోదయ్యాయి. వాల్తేరులో సాధారణం కంటే 11 డిగ్రీలు ఎక్కువగా అంటే 43.4 డిగ్రీలు నమోదైంది. విశాఖ జిల్లా పద్మనాభం, విజయనగరం జిల్లా గుర్ల, ప్రకాశం జిల్లా మర్రిపాడులో 44.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా అక్కివరంలో 44.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments