గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై వేటు పడింది.. పోస్టింగ్ ఇవ్వకుండా...

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (09:21 IST)
అధికార వైకాపా నేతలకు అడుగులుమడుగులు వత్తుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను బదిలీ చేసింది. పైగా, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
అదేసమయంలో ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
 
ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు  కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. 
 
అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్ నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీ అమ్మిరెడ్డిని గుంటూరు అర్బన్ ఎస్పీ బాధ్యతల నుంచి హఠాత్తుగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments