Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరన్ స్కేలుతో కంటిపై కొట్టిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అతికిరాతకంగా ప్రవర్తించింది. ఫలితంగా ఓ విద్యార్థి చూపును కోల్పోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా సంగడిగుంటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:45 IST)
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ అతికిరాతకంగా ప్రవర్తించింది. ఫలితంగా ఓ విద్యార్థి చూపును కోల్పోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా సంగడిగుంటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం కోటిమెరకకు చెందిన గరికపాటి పద్మజ కుమారుడు రామ్‌కుమార్ ‌(10) అనే బాలుడు స్థానికంగా ఉండే రాఘవ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూ బసులో స్కూలుకు వెళ్లివచ్చే ఈ బాలుడు... గత సెప్టెంబరు 14న బస్సులో పిల్లలు అల్లరి చేస్తుండగా, అదే స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే క్రోసూరి నాగలక్ష్మి చేతిలో ఉన్న ఐరన్‌ స్కేల్‌తో కొట్టింది. అది వేగంగా వచ్చి రామ్‌కుమార్‌ కంటిని తాకింది. 
 
కంట్లో నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పెదకాకాని శంకర నేత్రాలయానికి తీసుకెళ్లారు. ఆదేనెల 16న అక్కడి వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కూడా చూపు మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పగా, అక్కడ 15రోజులుగా చికిత్సను అందించినా ఫలితం లేదు. నల్లగుడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ బిడ్డ తల్లి గుండె బద్ధలైంది. దీనిపై పోలీసు కేసు పెట్టేందుకు ఆమె సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments