Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలిక శీలాన్ని చిదిమేశాడు... కామాంధుడుకి బాసటగా పోలీసులు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:35 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ళ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కామాంధుడుని అరెస్టు చేయాల్సిన పోలీసులు.. కామాంధుడుకి అండగా నిలబడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమ్మర్‌కోట గ్రామంలో మిర్యాల జయరాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై జయరాం కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను అక్కడే వదిలివేసి నిందితుడు పారిపోయాడు. బాలికను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ విషయం పోలీసులకు చేరవేశారు. అయితే, పోలీసులు మాత్రం తాస్కారం చేస్తూ బాధితుడుని అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత కుటుంబానికి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments