Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ ... ఆమెకు కరోనా అని తేలడంతో...

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (11:53 IST)
గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఓ గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెదకాకానికి చెందిన గర్భిణి ప్రసవం కోసం మూడు రోజుల క్రితం  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. మంగళవారం ఆమెకు పురుడుపోశారు. సహజ ప్రసవం కాకపోవడంతో సిజేరియన్‌ చేయాల్సి వచ్చింది. 
 
అయితే, ఆమెకు ప్రసవానికి ముందే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా, ఈ పరీక్షా ఫలితాలు గురువారం వచ్చాయి. ఇందులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో మంగళవారం లేబర్‌ రూమ్‌లో విధుల్లో ఉన్న 8 మంది వైద్యులు, జూనియర్‌ డాక్టర్లతో పాటు ఇద్దరు స్టాఫ్‌ నర్సులు ఆందోళనకు గురయ్యారు. 
 
అనంతరం వారు క్వారంటైన్‌కు వెళతామని సూపరింటెండెంట్‌కు చెప్పగా, ఆయన అంగీకరించారు. ముందస్తు జాగ్రత్తగా వీరందరికీ కరోనా వైద్య పరీక్షలు జరిపారు. రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments