Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పక్క గదిలో దిగిన జంట, యువతిని కోర్కె తీర్చాలంటూ ఎస్సై వేధింపు

పక్క గదిలో దిగిన జంట, యువతిని కోర్కె తీర్చాలంటూ ఎస్సై వేధింపు
, బుధవారం, 10 జూన్ 2020 (11:20 IST)
రక్షించాల్సినవాడే కామం కోర్కెలతో పక్కదారి పట్టాడు. పక్క గదిలో వున్న ఓ యువతిని తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. విషయం బయటకు రావడంతో బుక్ అయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే... అమరావతిలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో పెదకూరపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక జంట గది అద్దెకు తీసుకుంది. ఈ విషయాన్ని అదే వీధిలో వేరే అతిథి గృహంలో వున్న ఎస్ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ గమనించారు. వెంటనే ఇద్దరూ వెళ్లి ఆ గదిలో పోలీసు రైడ్ అంటూ బెదిరించారు.
 
 తమకు రూ. 10వేలు ఇవ్వాంటూ డిమాండ్ చేయడంతో సదరు యువకుడు రూ. 5 వేలు ఇస్తానని అంగీకరించాడు. తనవద్ద వున్న రూ.3 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.2 వేలు సమీపంలోని ఏటీఎం నుంచి డ్రా చేసి ఇస్తానన్నాడు. దాంతో ఆ యువకుడి వెంట తన డ్రైవరును ఇచ్చి పంపిన ఎస్ఐ గదిలో ఒంటరిగా వున్న యువతిపై కన్నేశాడు.
 
 తన కోర్కె తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె అందుకు తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని యువకుడు తిరిగి వచ్చాడు. దీనితో డబ్బు తీసుకుని ఆ జంటను వదిలేశారు. తమపై జరిగిన ఈ దారుణాన్ని ఆ జంట పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి: చిరంజీవి ట్వీట్