Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయం కోసం వెళితే కోర్కె తీర్చమన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్...

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (10:39 IST)
అన్ని విధాలుగా నష్టపోయి న్యాయం చేయమని ఠాణాకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. కేసు విచారణ పేరుతో ఆమె గురించిన అన్ని విషయాలు తెలుసుకుని తన కోర్కె తీర్చాలంటూ ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేధించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఓ వ్యక్తి తనను అన్యాయం చేశాడని, తన నుంచి డబ్బు కూడా కాజేశాడని, న్యాయం చేయాలని గంటూరు నగరంలోని ఓ సీఐను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఆ మహిళపై కన్నేసిన సీఐ ఆమెను లోబర్చుకోవాలనే దురుద్దేశంతోనే కేసును నాన్చుతూ వచ్చాడు.
 
దీంతో బాధితురాలు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆమెతో చనువుగా వ్యవహరించాడు. న్యాయం చేయకపోగా తనను లైంగికంగా వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి భోరుమన్నారు. తనకు వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపారని, న్యాయం చేస్తారేమోనని తాను కూడా ఇంతకాలం ఓపికగా ఎదురు చూశానని ఆమె పోలీసు అధికారుల వద్ద మొరపెట్టుకుంది. 
 
తనకు న్యాయం చేయకపోగా చివరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై అర్బన్‌ ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన డీఎస్పీ స్థాయి అధికారి ఆయా ఆరోపణలు వాస్తవమేనని అర్బన్‌ ఎస్పీకి నివేదిక అందజేశారు. దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అర్బన్‌ ఎస్పీ ఆ నివేదికను ఐజీకి పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం